26, సెప్టెంబర్ 2012, బుధవారం

ముగ్గురు కాబోతున్నాం


                                    ముగ్గురు కాబోతున్నాం 


విషయం తెలుసుకున్నరమణి, చెప్పలేని సంతోషంతో ఇంటిలో సందడి చేస్తూ " ఆయన
రాగానే ముందుగా ఈ విషయం చెప్పాలి " అని తనలో తను అనుకుంటుండగా...అప్పుడే
ఆఫీసు నుండి రమణి భర్త కిశోర్ అలసటగా ఇంటికి వచ్చాడు.
భర్తను చూడగానే మరింత సంతోషంతో " ఏవండీ...త్వరలో మనం ముగ్గురం కాబోతున్నాం
తెలుసా " అని చెప్పింది.
ఆ మాట వినగానే అలసట మరిచిపోయిన కిశోర్ " యాహూ... అమ్మ దొంగా ఇంత
ఆలస్యంగానా చెప్పడం " అని ఆనందంగా భార్యను దగ్గరికి తీసుకుంటుండగా, మాట
మధ్యలో రమణి కల్పించుకుంది.
" నాకు మాత్రం ఏం తెలుసండీ. గంట క్రితమేగా మా అమ్మ తను వస్తున్నట్టు చెప్పింది "
అని అసలు విషయం చెప్పింది రమణి.
ఆ మాట విని అదిరిపడిన కిశోర్ " ఆ...." అని నోరు తెరిచాడు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి