30, సెప్టెంబర్ 2012, ఆదివారం

వివిధ ఉద్యోగ పరిక్షల తెదీల్లో మార్పులు

హైదరాబాద్, న్యూస్‌లైన్: వివిధ ఉద్యోగాల భర్తీకి నిర్వహించనున్న రాత పరీక్ష తేదీలను ఏపీపీఎస్సీ మార్పు చేసింది. ఎనిమిది కేటగిరీల పోస్టుల రాత పరీక్షల నిర్వహణకు నిర్ణయించిన కొత్త తేదీలను తమ వెబ్‌సైట్ (www.apspsc.gov.in)అందుబాటులో ఉంచింది. శనివారమే జరగాల్సిన జిల్లా సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టుల రాత పరీక్షలను అక్టోబర్ 3, 4 తేదీల్లో నిర్వహించాలని నిర్ణయించింది. ఆదివారం జరగాల్సిన టెక్నికల్ అసిస్టెంట్ (జియో ఫిజిక్స్) రాత పరీక్షలను 4వ తేదీకి మార్చి, ఆ రోజు జరగాల్సిన అసిస్టెంట్ డెరైక్టర్ ఇన్ మైన్స్ పరీక్షలను వాయిదా వేసింది. 

అక్టోబర్ ఒకటిన నిర్వహించాల్సిన గ్రౌండ్ వాటర్ విభాగం అసిస్టెంట్ హైడ్రాలజిస్ట్ పరీక్షను, ఇండియన్ ప్రివెంటివ్ మెడిసిన్ విభాగంలో శాంపిల్ టేకర్ రాత పరీక్షను అక్టోబర్ నాలుగున నిర్వహించనున్నట్లు పేర్కొంది. ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీలో జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు రాత పరీక్షను అక్టోబర్ 6, 7 తేదీల్లో నిర్వహించనుంది. అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టుల రాత పరీక్షలను అక్టోబర్ 28న, పబ్లిక్ హెల్త్ విభాగంలో అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టులకు, అకౌంట్స్ ఆఫీసర్, జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్, సీనియర్ అకౌంటెంట్, డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ సర్వే పోస్టుల రాత పరీక్షలను నవంబర్ 3, 4 తేదీల్లో నిర్వహించనున్నారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి