అంకారా: ‘ఫిడే’ మహిళల గ్రాండ్ప్రి చెస్ టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్మాస్టర్ కోనేరు హంపికి తొలి ఓటమి ఎదురైంది. అన్నా ముజిచుక్ (స్లొవేనియా)తో బుధవారం జరిగిన తొమ్మిదో రౌండ్లో తెల్లపావులతో ఆడిన హంపి 58 ఎత్తుల్లో ఓడిపోయింది.
ఈ విజయంతో అన్నా ముజిచుక్ ఏడు పాయింట్లతో అగ్రస్థానంలోకి దూసుకెళ్లింది. ఆరున్నర పాయింట్లతో హంపి రెండో స్థానానికి పడిపోయింది. మరో రెండు రౌండ్లు మిగిలి ఉన్న ఈ టోర్నీలో గురువారం జరిగే పదో రౌండ్లో కుబ్రా ఒజ్టుర్క్ (టర్కీ)తో హంపి తలపడుతుంది.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి