ప్రజల కష్టాలు తెలుసుకునేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వస్తున్నా.. మీకోసం పాదయాత్ర హిందుపురం నుంచి ప్రారంభించారు. చంద్రబాబు వెంట లోకేష్, భువనేశ్వరి కూడా పాల్గొన్నారు. తొలుత సూగూర్ ఆంజనేయస్వామి దేవాలయంలో చంద్రబాబు ప్రత్యేక పూజలు చేశారు. తొలిరోజు 8.7 కి.మీ. పాదయత్ర చేయనున్నారు. 13 జిల్లాల్లో 100 నియోజకవర్గాల్లో చంద్రబాబు పాదయాత్ర చేయనున్నారు. 2200 కి.మీ. పాదయాత్ర చేయనున్నారు. రోజుకు 15 నుంచి 18 కి.మీ చంద్రబాబు పాదయాత్ర చేస్తారు. పాదయాత్రను కర్నూలు, మహబూబ్నగర్, రంగారెడ్డి, మెదక్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, కృష్ణా, పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో పాదయాత్ర చేపట్టనున్నారు. హిందుపురానికి భారీగా టీడీపీ కార్యకర్తలు తరలివచ్చారు. తెలుగు తమ్ముళ్లతో హిందుపురం వీధులన్నీ కిటకిటలాడాయి. సాంస్కృతిక నృత్యాలు ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. చంద్రబాబుది రాజకీయ యాత్ర కాదు, ప్రజాయాత్ర అని, పాదయాత్రకు మా పూర్తి సహకారం ఉంటుందని టీడీపీ నేతలు తెలిపారు. భారీకాన్వాయ్తో పసుపుదండు యాత్ర ప్రారంభమైంది.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి